పెరిని శివ తాండవం :
పెరిని శివ తాండవం : భారతదేశం కళల కు మరియు జ్ఞానం కు పెట్టింది పేరు . అదే విధంగా ఈ దేశం భరత నాట్యం, కథక్ ,కూచిపూడి వంటి ఎన్నో నాట్య కళల కు పుట్టిన ఇల్లు . అయితే ఇందులో కొన్ని నేటికీ ఎంతో కీర్తి ని గడిస్తున్నాయి . కానీ కొన్ని మాత్రం కనుమరుగై మరుగున పడ్డాయి. అలాంటి ఒక గొప్ప నాట్య కళ ఈ పేరిణి నృత్యం . 1970 వరకు కూడా దీనిపై ఎలాంటి పరిశోధన లేదు మరియు దీని గుంరించి ఎవరు పట్టినించుకోలేదు అటువంటి సమయంలో పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారు దీని పై పరిశోధన చేసి దీనిని పునరుద్ధరించారు. పెరిని శివ తాండవం లేదా పెరిని తాండవం ఇది తెలంగాణనను చివరిగా పరిపాలించిన కాకతీయుల రాజవంశ పరిపాలన లో అత్యంత ప్రాచుర్యం లో ఉండేది. కాకతీయల పరిపాలనలో ఇది ప్రతి దేవాలయం లో కనీసం 6 సార్లు ప్రదర్శించేవారు. మహేశ్వరులు , పశుపతులు, మైలవారపు దేవుళ్ళు, మరియు మెదలయిన తెగలకు సంభందించిన ఎంతో మంది మగవారు దీనిని ప్రదర్శించేవారు. హిందూ దేవుడైన శివుని గౌరవార్థం పెరిని నృత్యం ను నిర్వహిస్తారు మరియు సైనికులు యుద్ధానికి వెళ్ళుటకు ముందు సైనికుల యోక్క విజయ కాంక్ష ను బల పరుచుటకు దీనిని నిర్వహించే వారు . ఈ నృత్యం ను ప్రత్